జనసేన లోకి మరో మాజీ ఎమ్మెల్యే…?

janasena
జనసేన పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెల్సిందే.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ ఉదయభాను సామినేని జనసేన పార్టీలో చేరనున్నారు.
తాజాగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేపు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన చేరిక ఉన్నట్లు సమాచారం.
2014 సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో గుంటూరు నుండి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. జనసేనలోకి రోశయ్యతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు చేరనున్నట్లు టాక్.