YSRCP కి బిగ్ షాక్

 YSRCP కి బిగ్ షాక్

YSR Congress Party

Loading

వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి తమ రాజీనామా లేఖను పంపారు. జిల్లా అభివృద్ధి కోసం తాము జనసేన పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు.

ఇటీవల ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని,మేయర్ నూర్జహాన్ దంపతులు,పంతొమ్మిది కార్పోరేటర్లు సైతం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి చెందిన పలువురు రాజీనామాలు చేస్తూ అధికార కూటమికి చెందిన పార్టీలవైపు మొగ్గుచూపుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *