జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!

 జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!

Loading

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే  పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు..

ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దొరబాబును కాదని వంగా గీతను బరిలోకి దింపారు.

దీంతో దొరబాబు అప్పటి నుండి వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.. తాజాగా పవన్ తో భేటీ కావడంతో పార్టీ మార్పులు ఖాయం అని తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *