యోగీ సర్కారే అత్యంత అవినీతిమైంది-బీజేపీ ఎమ్మెల్యే సంచలనం.!

 యోగీ సర్కారే అత్యంత అవినీతిమైంది-బీజేపీ ఎమ్మెల్యే సంచలనం.!

Loading

ఉత్త రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత అవినీతి తమ పార్టీ అధికారంలో .. ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాథ్ హాయాంలో ఉందని లోనీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిశోర్ గుర్జర్ నిన్న శుక్రవారం సొంత ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు గుప్పించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను అధికారులు తప్పుదారి పట్టిస్తూ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని ఆయన నిన్న జరిగిన విలేకరుల మీడియా సమావేశంలో ఆరోపించారు. చిరిగిపోయిన కుర్తా ధరించి విలేకరుల సమావేశంలో పాల్గొన్న గుర్జర్ తన బట్టలను పోలీసులు చింపివేశారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.

ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శని, అయోధ్యలో అధికారులు లూటీ చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో గోవధ భారీ స్థాయిలో జరుగుతోందని, బూట కపు ఎన్కౌంటర్లలో ప్రజలు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *