కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందజేయాలి..!

 కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను  నిరుపేదలకు అందజేయాలి..!

Loading

వేములవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వీర్నపల్లి మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం,చేతుల మీదుగా,తాసిల్దార్ వేములవాడ అర్బన్ కి.ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలోని కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను  గుర్తించి, ఒక కమిటీ  వేసి  ప్రజా  అవసరాలకు  ఉపయోగపడేలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వవలసిందిగా మనవి.

మా మనవి  ఏమనగా  ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి అనగా 2020 నుండి 2025 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాలలో  ఉన్న కొందరు రాజకీయ నాయకులు,సంపన్నులు, మరికొందరు వ్యక్తులు, ఇతరులు,వారి స్వాలాభం కోసం, ప్రభుత్వ భూములు అనగా (అసైన్డ్ భూములు, లావని భూములు, పోరంబోకు భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, బంజరు భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, నిరుపయోగం ఉన్న భూములు, ప్రభుత్వానికి సంబంధించిన ఇతరత్ర భూములు )  నిరుపేదలకు చెందవలసిన   ప్రభుత్వ   భూములను  కబ్జాలు గురైనవి కావున, ఈ ప్రభుత్వ భూములను  గుర్తించటానికి  జిల్లాస్థాయిలో ఒక కమిటీ వేయాలి…

  కబ్జాలకు గురియినా ప్రభుత్వం భూములపై విచారణ జరిపిపించి వెంటనే ఆ ప్రభుత్వం భూములను  గుర్తించాలని మనవి చేస్తున్నాము.  మళ్ళీ ఆ ప్రభుత్వం భూములు కబ్జాలకు కాకుండా చూడాలని కోరుతున్నాము.అలాగే ఈ ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు,  ప్రజా  అవసరాలకు  ఉపయోగపడేలా ఉండాలి కోరారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసర్ల అరుణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేని మహేష్ యాదవ్ మండల కార్యదర్శి రమేష్ సంకెపల్లి ఉపాధ్యక్షులు నాగరాజ్ బీసీ నాయకులు దానే వేణు నాయకులు పాల్గొన్నారు..

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *