రైలు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందన

Union Minister Ashwini Vaishnav
యూపీలో వారణాసి -అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన సంఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ క్రమంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో ” రైల్వే ట్రాక్ పై ఉంచిన వస్తువును ఢీకొట్టడంతో సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను భద్రపరిచాము. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికుల కోసం మరో రైలును ఏర్పాటు చేశాము అని” ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు పట్టాలపై రాళ్లను ఇతర వస్తువులను పెట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
