పంజాబ్ ఓటమికి కారణాలు ఇవే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెల్సిందే. దాదాపు పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను ముద్దాడింది.
అయితే, ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడానికి కారణాలు ఇవే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 191పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు చెందిన ఓపెనర్ల తో పాటు వధేరా నెమ్మదిగా ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరగడం.
ఒకే ఓవర్లో వధేరా, స్టొయినిస్ అవుటవ్వడం. బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం. ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్య అద్భుతంగా బౌలింగ్ చేయడం లాంటి కారణాలు పంజాబ్ ఓటమికి కారణం అని క్రీడా పండితులు చెబుతున్నారు.
