తెలంగాణ సీఎంఓ అడ్డాగా మల్టీనేషనల్ లిక్కర్ కంపెనీలకు బెదిరింపులు

Do you need an American visa?
ప్రభుత్వానికి కేవలం ఎక్సైజ్ డ్యూటీ ద్వారానే ప్రతి సంవత్సరం దాదాపు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం సమకూరుతుంది.దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దల కన్ను లిక్కర్ కంపెనీల మీద పడింది. ఇంత పెద్ద లిక్కర్ ఇండస్ట్రీ నుండి ఎంతో కొంత లాభాన్ని కొట్టేయాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో లిక్కర్ వ్యాపారం చేసే మల్టీనేషనల్ కంపెనీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలోని కొందరు ప్రబుద్ధులు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది. మీ బ్రాండ్స్ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వాల్సిందే అని, లేకపోతే బకాయిలు చెల్లించేది లేదని, రాష్ట్రంలో మీ కంపెనీలని కనుమరుగు అయ్యేలా చేస్తాం అని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
ఈ సమాచారం బయటికి పొక్కడంతో లిక్కర్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మద్యం ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు పడుతోంది. రేవంత్ సర్కారు ఏర్పడిన నాటి నుంచి బకాయిల చెల్లింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆరు నెలల బకాయిలు ఇవ్వకుండా ఆయా కంపెనీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించాలి అంటే ఏకంగా మీ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ మాకు ఇవ్వండి అంటూ సీఎం కార్యాలయంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు బేరం పెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కమీషన్లు అడిగినా ఎంతో కొంత ఇచ్చుకునే వాళ్ళం కానీ ఏకంగా డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇచ్చేస్తే మాకు ఏమి మిగులుతుందని లిక్కర్ కంపెనీ ప్రతినిధులు వాపోతున్నారట.ఇది ఇలా ఉండగా, ఈ బెదిరింపులు సీఎం కార్యాలయంలో అందరికి తెలిసినప్పటికీ, తెలిసి తెలియనట్టు నటిస్తున్నారు. ఈ వ్యవహారం వెనకాల కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని గట్టిగా వినిపిస్తుంది. ఆ బెదిరించే ప్రబుద్ధులు సీఎంకి అత్యంత సన్నిహితులు అనే టాక్ కూడా వినపడుతుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, కాంగ్రెస్ పెద్దల చిలక కొట్టుడు చూసి తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి, వ్యాపారాలు చెయ్యడానికి ఎవరు ముందుకు రారు అని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
