విషాదం వెంట మరో విషాదం

 విషాదం వెంట మరో విషాదం

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లిలో అశ్వరావుపేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ మరణ వార్త విని గుండె పోటుతో అతని మేనత్త రాజమ్మ మృతిచెందారు..

ఈ వార్త తెల్సి వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి…

ఈసందర్బంగా అయన మాట్లాడుతూ  ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు.. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి

రాష్ట్రంలో గాడిదప్పిన పాలనకు నిదర్శనమే ఎస్సై శ్రీనివాస్ మృతి.. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి ఎస్సై శ్రీనివాస్ కుటుంబానికి కోటి రూపాయలు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది.. ప్రతిపక్షాలను, రైతులను, నిరుద్యోగులను, చివరకు ఉద్యోగులను కూడా వేధింపులకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని  అయన అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *