దిల్ రాజు కి షాకిచ్చిన సాయిపల్లవి..!

దిల్ రాజు నిర్మాతగా వచ్చిన మూవీ ఫిదా.. ఈ చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ.. కుటుంబ విలువలను ప్రతిబింబించే మూవీగా విడుదలైంది బలగం’ . ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి.
ఆయన తదుపరి చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ కథానాయకు డిగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ డ్రామా ఇదని సమాచారం. ఈ సిని మాలో కథానాయికగా సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో ఆమె ఈ సినిమాకు వెంటనే అంగీకరిం చిందని కథనాలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రం మే లేదా జూన్ నెలలో సెట్స్మీదకు వెళ్ల నుంది. అయితే ఆ సమయంలో సాయిపల్లవి డేట్స్ ఖాళీగా లేవని, ఇతర సినిమాలతో ఉన్న ముందస్తు కమిట్మెంట్ కారణంగా ఆమె ‘ఎల్లమ్మ’ నుంచి అయిష్టంగానే తప్పుకుందని వార్తలు వినిపిస్తు న్నాయి.