6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నిన్న బుధవారం అసెంబ్లీలో 2025-26 వార్షిక రాష్ట్ర బడ్జెట్ ను రూ.3,04,685 కోట్లతో ప్రవేశపెట్టారు. ఇందులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించారు..
మహిళలకు ప్రతి నెల మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ. 2500లకు గానూ మొత్తం రూ.4,305 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు..మరోవైపు గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు..
సన్న బియ్యం బోనస్కు రూ.1800 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,143 కోట్లు.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లను పెట్టినట్లు భట్టీ పేర్కొన్నారు.
