సీఎల్పీ భేటీ మధ్యలో లేచిపోయిన ఎమ్మెల్యే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీఎల్పీ భేటీలోనాగార్జున సాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.సీఎల్పీ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా జయవీర్ లేచి బయటకు వెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు
.ఓ వైపు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే జయవీర్ అలా వెళ్ళిపోతున్నాడు.. ఇలా నాన్ సీరియస్గా ఉంటారా.. బయటకు వెళ్లడం డిసిప్లిన్ కాదని ఫైర్ అయ్యారు..నాకు తెలియకుండా జయవీర్ రెడ్డికి ఏ పని చేయవద్దు అంటూ రేవంత్ ఆదేశించారు.
ఇకపై ఎమ్మెల్యేలు క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే జయవీర్ రెడ్డికి తనకు తెలియకుండా ఏ పనులు చేయొద్దని మంత్రులకు రేవంత్ ఆదేశించారంట.సీఎం రేవంత్ సీరియస్ అయిన విషయం తెలుసుకుని తిరిగి చివర్లో సీఎల్పీ మీటింగ్ కు జయవీర్ మళ్లీ హాజర య్యారంట.
