మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు గురించి సిట్ ముందుకు ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్రావు హజరయ్యారు.. ఈ రోజు ఉదయం11గంటలకు విచారణకు హాజరైన శ్రవణ్రావు అధికారులు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈరోజు ఉదయమే శ్రవణ్ విచారణకు వస్తారని పోలీసులకు ఆయన కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.. రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కీలకంగా శ్రవణ్రావు ఉన్నారు.. ఈ నెల 26నే శ్రవణ్రావుకు పోలీసులు నోటీసులు పంపారు ..
అయితే దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి ఊరట కల్పించడంతో విచారణకు శ్రవణ్రావు వచ్చారు.. గతేడాది మార్చిలో అమెరికాకు వెళ్లిపోయిన శ్రవణ్రావు నేడు విచారణకు రావడంతో కీలక విషయాలు రాబట్టనున్నరు పోలీసులు..
