కోర్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు

 కోర్టులపై పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan Deputy CM Of Andhrapradesh

Loading

తిరుపతి వారాహీ బహిరంగ సభలో పాల్గోన్న ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ” సనాతన ధర్నాన్ని దూషించేవారికే కోర్టులు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

చట్టాలు కూడా ఎలా పని చేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై అత్యంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. అన్య ధర్మాలను పాటించేవారిపై మానవత్వం కరుణ చూపిస్తాయని ఆరోపించారు. అయిన వాళ్లకి ఆకులు కానీ వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించింది.

ఇప్పుడు ఆకులు కూడా లేవు. చేతుల్లో పెట్టీ నాక్కోమంటున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ తిరుపతి లడ్డూ చుట్టారు.. అపవిత్రం చేశారని తాము ఎక్కడ కూడా చెప్పలేదు. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకుంటున్నారు అని పవన్ విమర్శించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *