పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూత..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూశారు.
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు.
చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హుస్సేణీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కు కేరీర్ మొదట్లో మార్షల్ ఆర్ట్స్ ,కరాతే, కిక్ బాక్సింగ్ ఆయన నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటేనే పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ సాధించారు.