అసెంబ్లీలో పల్లా వర్సెస్ మంత్రి పొన్నం..!

palla Rajashekar Reddy Vs Minister Ponnam
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్లు ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇటీవల రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాత్రిపూట జరిగిన ఎంఎంటీఎస్ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అని అన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ తమది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం.. ఎంఎంటీఎస్ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే దీనికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశాము .
మేము అధికారంలోకి వచ్చాక పోలీసులకు సంబంధించి పలు సంస్కరణలను చేశాము.ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్..నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాము. పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దు.పోలీసులను వాడుకుని ప్రభుత్వాన్ని నడిపితే..బీఆర్ఎస్లా ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించారు.
