రేపు జూబ్లీహిల్స్ లో మంత్రి తుమ్మల పర్యటన.

 రేపు జూబ్లీహిల్స్ లో మంత్రి తుమ్మల పర్యటన.

tummala nageshwararao

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తుమ్మల, వివేక్, పొన్నం ప్రభాకర్ లు రేపు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు షేక్ పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 వద్ద క్రీడా ప్రాంగణం & కమ్యూనిటీ హాల్ కు & పలు ప్రధాన రహదారుల వద్ద ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.

శుక్రవారం ఉదయం 10:45 గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హరిజన బస్తీ లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ను ప్రారంభిస్తారు..ఉదయం 11:15 గంటలకు యూసుఫ్ గూడా లో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తారు.ఉదయం 11:30 గంటలకు వెంగల్ రావు నగర్ లో గురుద్వార్ కమన్ వద్ద పలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *