అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

Minister Jupally Krishna Rao
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ టూరిజం ప్లాజాను సందర్శించారు.
ఈసందర్బంగా హిమాయత్ నగర్ పర్యాటక భవన్ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో అక్కడున్న హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సరిగ్గా సమయపాలన పాటించకపోవడం, హాజరుశాతం తక్కువగా ఉండటంపై మంత్రి జూపల్లి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
