మెగాస్టార్ కోటి విరాళం

Mega Star Chiranjeevi
భారీ వర్షాలతో.. వరదలతో అతలాకుతలమవుతున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని వరద బాధితులకు అండగా మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ముందుకు వచ్చారు. అందులో భాగంగా మొత్తం కోటి రూపాయలను వరద బాధితులకు సాయార్ధం విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణకు యాబై లక్షలు.. ఆంధ్రప్రదేశ్ కు మరో యాబై లక్షలు.. మొత్తం కోటి రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. వరదలతో వర్షాలతో రెండూ రాష్ట్రాల్లో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు కష్టాలు తనని కలిచివేస్తున్నాయి.
పదుల సంఖ్యలో అమాయకులు మృతిచెందగా.. కొన్ని వేల మంది నిరాశ్రయులవ్వడం చాలా బాధాకరం. ఈ విపత్కర పరిస్థితుల నుండి ఇరు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను అని ట్వీట్టర్ లో ట్వీట్ చేశారు.
