సరికొత్తగా మహేష్ బాబు..!

Mahesh babu
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడిశాలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పర్వత ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం మహేష్ బాబు సరికొత్త మేకోవర్తో సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటికొ చ్చింది. ఇందులో ఆయన రుద్ర అనే పాత్రలో కని పిస్తారని తెలిసింది. మహేష్బాబు సినిమాల్లో ఆయన పాత్రల పేర్ల విషయంలో కూడా ప్రత్యేకతలు కనిపిస్తాయి.
‘పోకిరి’లో పండు, ‘అతడు’లో పార్థు, ‘గుం టూరు కారం’లో రమణ వంటి పేర్లు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. దాంతో రాజమౌళి సినిమాలోని ‘రుద్ర’ అనే పేరు కూడా పాన్ ఇండియాకు రీచ్ అయ్యేలా బాగుందని అభిమానులు సోషల్మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే టైటిల్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
