డీఎస్సీ పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

 డీఎస్సీ పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

6 total views , 1 views today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ‌పై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో వర్గీకరణపై త్వరలోనే వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వనుందని మంత్రి లోకేశ్ సభలో చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ పాలనలోనే 70 శాతం ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని మండలిలో మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400