రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాళేశ్వరం కమీషన్..!

 రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాళేశ్వరం కమీషన్..!

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ బిగ్ షాకిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండు సార్లు రేవంత్ రెడ్డి సర్కారుకి లేఖ రాసింది.

తాజాగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కమిషన్ కార్యాలయానికి పిలిచి మరి విచారించింది. ఆ తర్వాత కూడా గత క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని మళ్లీ లేఖ రాసిన అటు నుంచి ఎలా స్పందన లేకపోవడంతో రేవంత్ సర్కారుపై కమిషన్ గుసయింది.

ఎన్ని సార్లు లేఖ రాసిన క్యాబినెట్ మినిట్స్ ఎందుకు ఇవ్వడం లేదని అగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. గత క్యాబినెట్ మినిట్స్ ఇస్తే అందులోని వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టాలనే కల నెరవేరదు.

అందుకే రేవంత్ రెడ్డి అందుకే క్యాబినెట్ మినిట్స్ ఇవ్వడం లేదని ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విచారణకు హజరైన మాజీ మంత్రి హరీశ్ రావు గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ సమర్పించిన నేపథ్యంలో క్రాస్ చెకింగ్ కోసం కమిషన్ రేవంత్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *