BCCI నూతన కార్యదర్శిగా జైట్లీ తనయుడు
బీసీసీఐ నూతన సెక్రటరీగా దివంగత నేత అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ నియామకం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న జైషా ఐసీసీ అధ్యక్షపోస్టుకు నామినేషన్ వేయనున్నరు. జైషా స్థానంలో రోహన్ జైట్లీ బీసీసీఐ కార్యదర్శిగా అవ్వడానికి రూట్ క్లియర్ అయింది.
రోహన్ జైట్లీ ప్రొఫెషనల్ లాయర్ .. ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ఐసీసీ చైర్మన్ అయ్యేందుకు జైషాకు సైతం మెజార్టీ మద్ధతు ఉన్నట్లు క్రీడా రంగంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.