ఆర్సీబీ కి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

IPL 2025 prize money
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పంజాబ్ కింగ్స్ జట్టుతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో కప్ ను అందుకుంది.
అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నలబై మూడు పరుగులతో రాణించాడు. ఐపీఎల్ -2025 ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీకి రూ.20 కోట్లు ప్రైజ్ మనీగా దక్కింది. మరోవైపు రన్నరప్ జట్టుగా నిలిచిన పంజాబ్ కు రూ.12.5 కోట్లు దక్కాయి.
ఎక్కువ పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న సాయి సుదర్శన్ కు పది లక్షలు, ఎక్కువ వికెట్లను తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచిన ప్రసిద్ధ్ కృష్ణకు పది లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది. ఆర్ఆర్ బ్యాట్స్ మెన్ సూర్యవంశీ సూపర్ స్ట్రైకర్ గా టాటా కర్వు గెలుచుకున్నాడు.
