గ్రూప్ -3 పరీక్ష ఫలితాలు విడుదల..!

తెలంగాణలో ఇటీవల పరీక్ష నిర్వహించిన గ్రూప్ -3 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు శుక్రవారం విడుదల చేసింది.
గతంలో మొత్తం 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.. గ్రూప్ -3పరీక్షలకు 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు..
గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి.. మొత్తం 2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు హజరయ్యారు..
ఈరోజు విడుదలైన ఫలితాలతో పాటే ఫైనల్ కీ సైతం విడుదల చేసిది. అభ్యర్థుల లాగిన్ ఐడీలకి OMR షీట్స్ జతచేసి ఉన్నాయి.
