సన్ రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్..!

 సన్ రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్..!

sUNRISERS ipl

Loading

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి తనకు నిర్వహించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న నితీశ్‌ కుమార్ రెడ్డి తాజాగా నిర్వహించిన పిట్ నెస్ పరీక్షలో ఫుల్ ఫిట్ అయిన‌ట్లు నివేదిక ద్వారా ఖరారైంది.

మరోవైపు నితీశ్ కుమార్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు కూడా క్రీడా వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. యువ ఆటగాడు నితీష్ కుమార్ ఇటీవ‌ల జ‌రిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విష‌యం మనకు తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ స‌మ‌యంలో అత‌ను గాయానికి గుర‌య్యాడు. దీంతో అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఫిట్‌నెస్‌కు చెందిన అన్ని కామన్ ప‌రీక్ష‌ల‌ను ఈ ఆటగాడు క్లియ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. యో-యో టెస్టులో కూడా అత‌ను పాసైన‌ట్లు రిపోర్టు వచ్చింది. బెంగుళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో నితీశ్ .. కోలుకుంటున్నాడు. మొత్తం ఐపీఎల్‌లో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు నితీశ్ రెడ్డిని 6 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో అత‌ను 13 మ్యాచుల్లో 303 ర‌న్స్ చేశాడు. అత‌ని స్ట్ర‌యిక్ రేట్ 143గా ఉంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో అత‌ను త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో విరోచితంగా 114 ర‌న్స్ చేశాడు.ఈ నెలలో ప్రారంభం కానున్న ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో హైద‌రాబాద్‌లో ఆడ‌నున్న‌ది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *