రూ 15000లపై బాబు సర్కారు క్లారిటీ

2 total views , 1 views today
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకంపై ఉత్తర్వులు విడుదల చేసింది.
దీనిప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను సర్కారు పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని ఆ జీవోలో పేర్కొంది.
అయితే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.
