అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy Former Minister of Food Processing of Andhra Pradesh
ఏపీలోని తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే. దీంతో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు…. కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారినికి వాయిదా పడింది….
వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన మాజీ మంత్రి కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. నిన్న ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలతో కాకాణి భేటీ అయ్యారు.అనంతరం విజయవాడ నుంచి లాయర్ ఫోన్ చేశారని చెప్పి కాకాణి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది..
