వరద బాధితులకు అండగా సినీ ప్రముఖులు

Siddu Jonnalagadda
ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు.
తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు లక్షలు ఏపీకి.. మరో ఇరవై ఐదు లక్షలు తెలంగాణకు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నారు.
మరో హీరో సిద్ధు జొన్నలగడ్డ ముప్పై లక్షలను వరద బాధితులకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు మీడియా ప్రకటనలో తెలిపారు.విపత్తుల నుండి రెండూ రాష్ట్రాల ప్రజలు త్వరగా తేరుకొవాలి. ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.
