ఎంపీనే బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ కేటుగాళ్లు
ఈరోజుల్లో సామాన్యుల దగ్గర నుండి సెలబ్రేటీల వరకు అందరూ ఏదోక సందర్భంలో సైబర్ క్రైమ్ కేటుగాళ్ల ఉచ్చులో పడినవాళ్ళే.. మరోవైపు ఇటీవల కాలంలో ఇలాంటి సైబర్ కేసులు పెరిగి పోతున్నాయి. ఏకంగా నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు.
వీరిజాబితాలోకి ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలేకూడా చేరిన సంగతి తెల్సిందే.. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది.
సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.