రిజర్వేషన్ల రద్ధుకు కాంగ్రెస్ కుట్ర
అమెరికాలో ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఓ డ్రామా అని, ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని యూపీ మాజీ ముఖ్యమంత్రి …బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని, కుల గణన సైతం చేపట్టలేదని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని ఆమె ఎద్దేవా చేశారు.
భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన నిర్వహించలేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని రక్షించే నెపంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కచ్చితంగా అంతం చేస్తుందని.. అందుకే కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.