సీఎం మమత అబద్ధాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అబద్ధాలు చెబుతున్నారు అని కోల్ కతాలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోల్ కతాలో అత్యాచార హత్య సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. నిన్న సుప్రీం కోర్టుకు కూడా తమ నివేదికను సమర్పించింది సీబీఐ..
ఈ నేపథ్యంలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వచూపారు అనే ఆరోపణలను ముఖ్యమంత్రి మమత బెనార్జీ ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దీదీ అన్ని అబద్ధాలు చెబుతున్నారు.
మీకు పరిహారం ఇప్పిస్తానని ముఖ్యమంత్రి అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్ధం ఏదైన నిర్మించుకోవచ్చు అని సలహ ఇచ్చారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తాము. అప్పుడు పరిహారం తీసుకుంటాము అని చెప్పాము అని వారు అన్నారు.