సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!

 సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!

Loading

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణీ నారా భువనేశ్వరి జీహెచ్ఎంసీకి రూ.5.50కోట్ల పన్నులను ఎగవేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఆస్తి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పన్ను కట్టలేదని గుర్తించింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆస్తి పన్ను రూ.5.5 కోట్లు బకాయిలు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు‌ జారీ చేసింది.

మరోవైపు ఇప్పటికేబల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలను జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.జీహెచ్ఎంసీకి కొంతమంది కోట్ల రూపాయల పన్నులను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు.ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని బల్దియా అధికారులు హెచ్చరించారు.

రూ.5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లని అధికారులు తేల్చారు.జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52 కోట్లని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లని అధికారులు గుర్తించారు.హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు చెల్లించాలని, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ.5.50 కోట్లు, సోమాజిగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పన్నులు చెల్లించాలని తెలిపారు.వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *