వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విబేధాలు…?

Heat In Warangal Congress
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు మరోకసారి బయటపడ్డాయి. జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విబేధాలు దసరా పండుగ సందర్భంగా భగ్గుమన్నాయి.
దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సీల్లో.. బ్యానర్లలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఈ విబేధాలకు ఆజ్యం పోసింది. దీంతో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
పోలీసులు ఎమ్మెల్యే అనుచరులను వదిలేసి మంత్రి కి చెందిన అనుచరులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నిన్న జరగగా కొద్ది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ధర్మారం రైల్వే గేటు దగ్గర కొండా అనుచరులు ధర్నాకు దిగారు.
