చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM CHANDRABABU

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.

అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ” దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసుండాలని కలలు కన్నాము.. దానికి తగ్గట్లు 1946లో విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడామని, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి.. ప్రతీ శాఖ అవినీతిమైంది. ప్రభుత్వ భూములను,దేవుడి భూములను ఆక్రమించుకున్నారు.. అఖరికి పేదల భూములను వదల్లేదు. రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. తప్పు చేసిన .. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవర్ని వదలబోము.. చట్టం ప్రకారం వాటన్నింటిని రికవరీ చేస్తాము” అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *