కేంద్ర మంత్రి బీజేపీ వర్మ కీలక వ్యాఖ్యలు

 కేంద్ర మంత్రి బీజేపీ వర్మ కీలక వ్యాఖ్యలు

కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపాతీరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా భీమవరం వచ్చారు.

ఈసందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఏ ఒక్కర్ని మరిచిపోను. అందర్నీ గుర్తుపెట్టుకుంటాను. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను.

నలభై ఏండ్లుగా ఎంతోమంది దగ్గర పని చేశాను. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటాను. కష్టపడే కార్యకర్తకు బీజేపీ లో తగిన గుర్తింపు ఉంటుంది. నేను నామినేషన్ వేసేదాకా నాగురించి ఎన్నో అసత్య ప్రచారాలను ప్రచారం చేశారు. వాటిని ప్రజలు తిప్పికొట్టారు అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *