ఈ ఏడాది సెప్టెంబర్లో “ఆసియా కప్”

వచ్చే సంవత్సరం భారతదేశం, శ్రీలంక దేశాల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరిగే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది.
దీనికి సంబంధించి ఏసీసీ ( ఆసియా క్రికెట్ కౌన్సిల్) ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీ సెప్టెంబర్లో జరుగుతుంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నాము.
ఈ టోర్నీలో ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఓమన్, హాంకాంగ్ ల మధ్య మ్యాచులు జరగనున్నాయి.
