ఏపీ హోం మంత్రి అనిత మానవత్వం

Minister Anita’s counter to YCP leaders..!
ఏపీలోని నరసరావుపేట బైపాస్ రోడ్డు వద్ద ఈరోజు ఏపీ హోంమంత్రి అనిత మానవ త్వం చాటుకున్నారు. ఆమె వెళ్తున్న దారిలో సోమవా రం బైక్ ప్రమాదం జరిగింది. ఆమె కాన్వాయ్ దిగివచ్చి మరి బాధితులకు ప్రథమ చికిత్స చేశారు.
వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా నరసరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది, ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళుతున్న మంత్రి అనిత ఈ ప్రమా దాన్ని గమనించారు.
దీంతో వెంటనే తన కాన్వాయ్ను ఆపి బాధి తుల దగ్గరికి వెళ్లారు. గాయపడిన యువతికి స్వయంగా నీళ్లు పోసి గాయాలను తుడిచారు.మరో వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.