దేశంలో మరో భాషా యుద్ధం…!

 దేశంలో మరో భాషా యుద్ధం…!

Loading

కేంద్రం తమపై హిందీ భాషను రుద్ద డానికి ప్రయత్నిస్తోందని తమిళ నాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధా నికి రాష్ట్రం సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ నిన్న మంగళవారం ప్రకటిం చారు.

రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

జనాభా నియంత్రణకు దారితీసిన కుటుంబ ప్రణాళిక కార్యక్రమాన్ని తమిళనాడు విజయవంతంగా అమలు చేసిన కారణంగా ఇప్పుడు 8 లోక్సభ స్థానాలను కోల్పోయే ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోం దని స్టాలిన్ తెలిపారు. భారత ఎన్నికల కమి షన్లో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. నియోజకవర్గాల పునర్వి భజన పేరిట దక్షిణాదిపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *