ఆగస్టు 15నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

 ఆగస్టు 15నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

Aarogya Sri Services to be Stopped in AP

Loading

ఏపీలో గత ఐదారు నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో రేపటి నుండి (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

2023 సెప్టెంబర్ నెల తర్వాత ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500కోట్లు రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.160కోట్లను విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకు సైతం డబ్బులు లేవు. అందుకే రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలను అన్ని ఆసుపత్రుల్లో బంద్ పెడుతున్నాము. ఇప్పటికైన ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యలను పరిష్కరించి బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాము” అని అసోసియేషన్ ప్రకటించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *