బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్కిల్ యూనివర్సిటీ లతో పాటు పలు సదుపాయాలతో నాలుగో సిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే.. అయితే ఈ సిటీ పై కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు..
ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు.. కేసీఆర్ బీఆర్ఎస్ ను తిట్టడం తప్పా చేసింది ఏమి లేదు.. ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములను తన అనుచరులకు బినామీలకు అప్పజెప్పడం తప్పా సిటీ లేదు ఏమి లేదు…
వేల ఎకరాలను దోచుకోవడం.. దాచుకోవడం తప్పా ప్రజలకు ఏమి చేయదు.ఏడు నెలలవుతున్న కానీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు.. రుణమాఫీ ఊసు లేదు కానీ మూసీ నది ప్రక్షాళన చేస్తారంటా… వెంటనే ధరణి, అన్యాక్రాంతమైన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు…
