మాగంటి గోపినాథ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు.

 మాగంటి గోపినాథ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు.

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లిహీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం ఉదయం 5.45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మాగంటి మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నారు.

చాలా సౌమ్యుడిగా ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. హైదరాబాద్ సీనియర్ రాజకీయ నేతగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాని మీడియా ప్రకటనను విడుదల చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *