కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పి చిదంబరం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘కాంటెస్టింగ్ డెమోక్రటి డెఫిసిట్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంటుందనే నమ్మకం నాకు లేదు. పార్టీ చాలా బలహీనంగా ఉంది.
కానీ బీజేపీ పార్టీ మాత్రం చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. బీజేపీ కు మున్ముందు భవిష్యత్ మంచిగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే, చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటిరిస్తూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ఆ పార్టీ నాయకులకే నమ్మకం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.