హెచ్ సీయూ కి బీజేపీ ఎమ్మెల్యేలు..!

BJP MLAs for HCU..!
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఈ రోజు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది.
కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి వేయాలని ప్లాన్ చేస్తోంది.