ఆనందంలో కోమటిరెడ్డి..!. ఆవేదనలో ఉత్తమ్..!!

Komatireddy in joy..!. Uttam in sorrow..!!
వారిద్దరూ ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలాంటివాళ్ళు.. వీరిద్దరూ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు.. అందుకే ముఖ్యమంత్రి కావాలనే కలలు కన్నారు. వాళ్ల కలలు కలలుగానే మిగిలిపోయాయి. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పదవి కాలం అప్పుడే పూర్తి చేసుకున్నారు. సీఎం పదవి ఎలాగైన దక్కలేదు కనీసం ఇంట్లో ఇద్దరూ మంత్రులుండాలనే ఆశపడ్డారు.
అయితే మంత్రి కోమటీరెడ్డి వెంకట రెడ్డి ఆశ తీరింది కానీ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశ మాత్రం ఆడియాశ అయింది. అసలు విషయానికి వస్తే ఏఫ్రిల్ మూడో తారీఖున మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం దాదాపు ఖారారైంది.ఈసారి విస్తరణలో నలుగురికి అవకాశం ఇవ్వాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంలో భాగంగా ఎస్సీ బీసీ ఓసీ విభాగంలో ఆయా నేతలకు పదవులివ్వాలని చూస్తుంది. అందుకే నిన్న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గవర్నర్ ను కలిశారు. అయితే ముందు నుండి పార్టీలో ఉండటం. తమ కేరీర్ అంతటా పార్టీకోసం పని చేస్తుండటంతో తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
లేదు నేను నా తమ్ముడు పార్టీకోసం చేసిన సేవలను గుర్తుంచుకుని తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికివ్వాలని పట్టుబట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో సుధీర్ఘంగా ఆలోచించిన ఆధిష్టానం కోమటీరెడ్డి బ్రదర్స్ వైపే తలొగ్గింది. దీంతో తన సతీమణికి పదవి రాలేదని ఆవేదనలో ఉన్నారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి.
