జూపల్లి ఏంటీ ఈ లొల్లి- మండలి చైర్మన్..!

Gutha Sukender Reddy
తెలంగాణ శాసనమండలిలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో ఓ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ ప్రసంగంపై జరుగుతున్న చర్చలో మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించే విధంగా మాట్లాడటానికి ప్రయత్నించారు.
దీంతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రసంగాన్ని అడ్డుకునేందు కు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అంతకుందు బీఆర్ఎస్ ఎల్పీ మండలి నేత మధుసూదన చారీ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనలో మాజీ సీఎం .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర గురించి.. ఆ తర్వాత స్వరా ష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల పాలనలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే దీనిపై మంత్రి జూపల్లి స్పందిస్తూ తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను కాదనలేము..
కానీ వేల మంది విద్యార్థుల ఆత్మబలిదానాల వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ పాత్రను తక్కువ చేసి చూపించేవిధంగా అన్నారు. అంత కుముందు మంత్రి సీతక్క కూడా ఇదే విధంగా మాట్లాడారు. వారి వ్యాఖ్యలపై కొద్దిసేపు సభలో దుమారం రేగింది. బీఆర్ఎస్ సభ్యు లు మధుసూదనాచారి, కవిత తదితరులు ఒక్కసారిగా లేచి నిరసన తెలిపారు. దీంతో చైర్మన్ గుత్తా సుఖేందర్ జూపల్లి ఏంటి ఈలోల్లి అన్నట్లు సదరు మంత్రి మైక్ ని కట్ చేసి మంత్రిని కూర్చోవాలని చెప్పా రు.
