బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో బండి సంజయ్..కిషన్ రెడ్డి..!

బీజేపీ జాతీయ అధ్యక్ష బరిలో తెలంగాణ బీజేపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు..ప్రస్తుత కేంద్ర మంత్రులైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిలు బరిలో ఉన్నట్లు ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ లో ఓ కథనం వెలువడింది.
బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ నుంచి జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరితోపాటు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ లాల్, మనోజ్ సిన్హా రేసులో ఉన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ లో ఒకరికి పగ్గాలు అప్పగించి సౌత్లో పార్టీని మరింత పటిష్ఠం చేయాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. మార్చి వరకు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.