అవినీతి అంతమంటూ వచ్చి..లిక్కర్ స్కాంతో ఓడారు.!

 అవినీతి అంతమంటూ వచ్చి..లిక్కర్ స్కాంతో ఓడారు.!

Loading

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజ్రీవాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదన్నారు అన్నా హజారే.అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడంపై పలుమార్లు హెచ్చరించాను.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి మంచి వ్యక్తిత్వంతో పాటు, మంచి ఆలోచనలు ఉండాలని నేను భావిస్తాను. వ్యక్తికి సంబంధించిన క్లీన్ ఇమేజ్ ఉండాలి. లేకపోతే ప్రతికూల ప్రభావం చూపుతుంది.ఆప్ నేతలు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లారు.

ఇలాంటివి ఉండకూడదని చాలా కాలం నుంచి చెబుతున్నాను. ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని(అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *