టీటీడీ కీలక నిర్ణయం..!
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి నెల ఇకపై చివరి మంగళవారం సమావేశం కావాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన చర్యలు సహా ఇతర అంశాలపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ ఆలోచన చేశారు.
దీనికి తగ్గట్టుగా ప్రతినెలా అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు.