మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

Konda Surekha Minister Of Telangana
3 total views , 1 views today
మంత్రి కొండా సురేఖ మరోకసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల అక్కినేని కుటుంబం వ్యక్తిగత వ్యవహారాల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా ప్రభుత్వ విద్య గురించి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడూతూ ” ప్రభుత్వ టీచర్ల పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నారు.. ప్రభుత్వ విద్యపై.. మీపై మీకు నమ్మకం లేదా..?. నమ్మకం లేకుండానే మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు.
మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదివించాలి అని సూచించారు. అన్ని కులాలు.. అన్ని మతాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తీసుకోచ్చేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.